23, ఏప్రిల్ 2011, శనివారం

ఎవడు యాగం చేస్తే దిమ్మదిరిగి మైండ్ బ్లాకై చీలిపోద్దో......

ఎట్టకేలకు తెబ్రాలు పరమ సక్సెస్ ఫుల్ గా వేర్పాటై మే 1 న 'తెలంగాణా అర్చక,బ్రాహ్మణ శంఖారావం' చేస్తునారట. శుభంభూయాత్! బ్యానర్ పేరు:తెలంగాణా బ్రాహ్మణ ఐక్య కార్తాచరణ సమితి. ప్రదేశం: దోమలగూడా లోని ఏ.వీ.కాలేజ్ మైదానం. సమయం: సా.4 గం; సభాప్రముఖులు:కేసీయారు,కిషన్ రెడ్డి (ఊహించినట్టే.... షరా మామూలే)(కోదండరాం - గద్దరు బాచుంటుందో- సంఘపరివారముంటుందో అప్పుడే తెలీదు-మనకి! ఇవి మున్ముందు వేరే ’పరిణయాలకు’ (పరిణామాలకి కాదు) దారితీయచ్చు-పాపం మంత్రి శ్రీధర బాబు ని పిలిచుంటే, ఏం మాట్టాడమని అడుగుతారో చూడాలి) అదలా వుంచి-నాకు తెలిసి ’బ్రాహ్మణ సేవాసంఘ సమాఖ్య (ఈస్ట్ జోన్) (మిగతా జోన్ల సంగతి తెలీదు) అని ఆనందబాఘ్,ఖైరతాబాద్ లోనూ, మరో ఆఫీసు శాతవాహన నగర్, వనస్థలిపురం లోనూ ఉంది. ఈ కొత్త సమాఖ్యకీ పాత సమఖ్యకీ కోర్డినేషన్ ఉందో లేదో మనకనవసరం.
అయితే ఒక విషయం నన్ను బాగా కదిలించింది. ఎవడు యాగం చేస్తే దిమ్మదిరిగి మైండ్ బ్లాకై చీలిపోద్దో ఆడి చేత చీల్పించుకున్నది - ఆ యాగం చేసిన బుధజనమే అయుండడం. కన్ఫ్యూసింగా ఉందా! పర్లేదు. వదిలేద్దాం. అసలింత వీజీగా .....సునాయాసంగా....సంఘటితం కావలసిన తరుణంలో..... ఒక ’కులం’ ప్రాంతీయంగా చీలికకి గురి కావడం బహుశా 'ప్రపంచ కులాల్లోనే' సంచలనం కలిగించేదే. గిన్నీసు తరహా గిన్నెలో ఒదగదగ్గదే. ఏదేమైనా ’సర్వేజనా సుఖినోభవంతు’ అనేది మా లక్ష్యం గా ...... ఒకటి చెప్పాలనుంది. అదేంటంటే - "పదవులు మాకు - సామూహిక ఉపనయనాలు,పెళ్ళిళ్ళూ మీకు" అనే ఎజెండా నించి సమాఖ్య పెద్దలు దూరంగా ఉండాలి. ఈరోజు నుంచి 100 రోజుల తర్వాత సగటు 'పేద బ్రాహ్మణుడి' కి ఏమాత్రం సేవ చెస్తారో చేయిస్తారో చూసి బ్లాగుతాను.బాయ్!