25, డిసెంబర్ 2011, ఆదివారం

మా సెకండ్ క్లాస్ తేజ్ గాడి కోల’వెర్రి’....


మా సెకండ్ క్లాస్ తేజ్ గాడి కోల’వెర్రి’....why this? look this



27, నవంబర్ 2011, ఆదివారం

What's KOLAVERI?



freedom of expression-by A.P.Shah, retired CJ of Madras and Delhi HC.

The jurisprudence revolvingn round the 'freedom of expression' enshrined in the Indian Constitution in the light of present day scenario is thoroughly presented by the author in the article cited in the subject above. May be a good read for a student of Law and the same is attached here for ready reference placed with courtesy by The Hindu as well as the author.

16, నవంబర్ 2011, బుధవారం

చివరిగా ఆంబ్రా-తెబ్రాలు గా చీల్చిన


చివరిగా ఆంబ్రా-తెబ్రాలు గా చీల్చిన (చీల్చామనుకుంటున్న) రాజకీయం ఇప్పుడు ఇహ చీల్చే కార్యక్రమాలు పెట్టే ఆలోచనలు వదిలి లేటెస్ట్‌గా " మన్మొహన దెబ్బకి" కుదేలైపోయిన వైనం అంతా చూశాం! సదరు రాజకీయాన్నటుంచి - ఓ నూట యాభై రోజుల క్రితం చీలామనుకుంటున్న ’సంఘం’ఏం పీకుతారో అని ఓ పోస్టు ఇక్కడ వేశాను. ప్రోగ్రెస్ ఏం లేక పోగా - నేటి (16-11-11, 6 వ పేజీ) ఈనాడు లో ఓ వార్త నన్నాకర్షించింది. అది ఇలా ఉంది.
దీని further development ఏంటో త్వరలోనె చూద్దాం.Bye!

28, ఆగస్టు 2011, ఆదివారం

Victory of people of mother India-in the form of Annaa.....

People of the great India has emerged victorious in supporting for a great common cause of 'corruption free India' and being a symbol of common man Anna has succeeded in mustering  mammoth support across the nation this time.  His emergence as a champion amidst the machinations to hijack the movement by saffrons through Ramdev and other politicians across is quite remarkable and finally got the goods delivered..... by getting promise of  tabling the  suitabe Janlkok pal and allied bills in the parliament from the people at the helm of affairs and wherefore  Annaaji is  going to conclude his fast tomorrow at 10-00 am.  Here is my hubby's pictorial jubilance to share with.....

12, ఆగస్టు 2011, శుక్రవారం

సినిమా రిలీజ్ పై రిజర్వేషన్

    అనుకున్నట్టే  'ఆరక్షణ్' హల్చల్ చేస్తోంది. తాజా ఏమంటే దీన్ని ఏ.పి.లో బ్యాన్ చేసారట.  జనవరి-25 న  నా బ్లాగ్ పోస్ట్  లో ఈ విషయం ఉహిమ్చినట్లే  హల్చల్ చేసింది. సరస్వతీమాత నగ్న చిత్రాన్ని వేసి 'freedom of expression' అని సరిపెట్టుకుంటే - current sociopolitical touch తో తీసిన document లో మాత్రం 'freedom' చూడగూడదుట. Lets see what is in store with this movie.




24, జులై 2011, ఆదివారం

గ్లోబలైజేషన్‌లో వైద్య పరిఙ్యానం పెరిగినా మరిగుజ్జు డాక్టర్లు అంతే పెరిగారు

వర్చు ఇలా వాపోయిన సందర్భం ఆయన మాటల్లోనే ......."డాక్టర్స్ ని మనం దేవుళ్ళంటాం! ప్రాణం పోతుంటే ’పోసే’ లేక ’ఆపే’లక్షణం వారికుండబట్టే ఇలా అంటాం. అయితే ఒక డాక్టరూ మహా అయితే ఒక కాంపౌండర్ లేక టేస్ట్ ని బట్టి ఒక నర్సమ్మ ఉండేవారు పూర్వం! పేషంట్ కి సదరు డాక్టరంటే ’ఆకర్ష’నో లేక ’వికర్ష’ నో ఉండేది ట్రీట్మంటు బట్టి. కార్పొ’రేట్’ ఆసుపత్రులు వచ్చింతర్వాత వివిధ రకాల విభాగాలతో వివిధ రకాల సిబ్బందితో ఇబ్బందులు ఇబ్బడి ముభ్భడిగా పెరిగి - ఒక విభాగంలో మనకున్న ’జబ్బు’మరో విభాగంలో ’మరో జబ్బుగా’ పరిణమిస్తుంది. ఒక్ జబ్బుతో వచ్చి ఒక జబుతో బయటికి వెళతాం లేదా ’పోతాం’. వైద్యో నారాయణో ’హరి’ రావులు మామూలుగా ’ట్రింగ్’ అని బెల్లు కొట్టి మరో ’మూడిన’ వ్యక్తి కి ఎంట్రి కల్పిస్తారు. ఈ ’విభాగాల’ జబ్బు ’గవర్నమెంట్లో’ను ’కార్పొరేట్లోనూ’పోటాపోటీగా పెరగడం పేషంట్‍కి పేషన్సు పోయి ’శ్మశాన వైరాగ్యం’ అడ్వాన్స్ గా కనిపింపజేసి ఆనక శ్మశానం అంటే అకస్టం అయిపోయేలా చేసే చక్కటి ప్రక్రియ. భేష్! ఇదొక విషవలయం. ఎవడి పాపాన వాడే ’పోతాడు’అనే చక్కని ఆధ్యాత్మిక భావన పరిడవిల్లేలా చేసి ’పుణ్యం’ కట్టుకుంటున్నారు ’వైద్యహరినారాయణులు’. అదీ ఆ రోజులకీ ఈ రోజులకీ తేడా!! ఈ నేపధ్యంలోనే - డాక్టర్ల ఆరాద్యభావానికి ’జబ్బు’ పట్టింది పబ్లిక్లో. ఇదీ నేను చెప్పదలుచుకుంది!  అతి చిన్న రెండు ఉదాహరణలు(నాకు సంబంధించి) చెప్పి తప్పుకుంటాను.
ఒకటి-హార్ట్ ఆపరేషన్ అయిపోయి సక్సెస్‌ఫుల్గా బయటి కొచ్చిన మా అమ్మని అన్నీసిట్రిక్ ఫ్రూట్సే ఎక్కువ తినమన్నాడు డాక్టర్. అరటి పండు సంగతేంటి అని అడిగిన నాకు -పోయి డయాబెటిస్ట్ని ’కంసల్ట్’ చేయండి అని సిన్సియర్‌గా సలహా ఇచ్చాడు కార్పొ’రేట్’ డాక్టర్! ’ట్రింగ్’అంటూ బెల్లు. విభాగ వైపరీత్యం అంటే ఇదేనేమో!!
రెండు-నాకు నిన్నరూట్ కెనాల్ చేశారు పళ్ళకి! మరో సిట్టింగ్ కూడా ఉంటుంది. రెండురోజుల ముందు నుంచి పూర్తిగా దంతాలకి ’క్రౌన్’ పెట్టెదాకా బలమైన ’ఆర్డెంట్’ మాత్రలు వాడి వాడీ ’వాడి’పోవాల్సుంటుంది. టొటల్‌గా ఆంటీబయాటిక్స్‌తో భ్రష్టు పట్టిన దేహాన్ని రిపైర్ చేయడానికేమన్నా ఆంటీడోట్ ఇస్తారా దేహం శుభ్రం కావడానికి అనడిగాను మిడిమిడి ఙ్యానం తో. సదరు డాక్టర్లు ఇద్దరూ అనీక్వివోకల్‌గా నకు చెప్పిన సమాధానం - మందు ఒక లార్జ్ కొట్టి పడుకోండి. సరిపోతుంది.  నా పరిధిలో - కంటేంపరరీ హెల్త్ ఫీల్డ్ కు పట్టిన ’జబ్బు’గా నేను రికార్డు చేయదలచుకున్నాను. గ్లోబలైజేషన్‌లో వైద్య పరిఙ్యానం పెరిగినా మరిగుజ్జు డాక్టర్లు అంతే పెరిగారు. పరిశోధన తగ్గి పెగ్గు ఎక్కువైంది వైద్యగణానికి అనుకోవచ్చా?

21, జులై 2011, గురువారం

నహ్..రా.....యణ ...నహ్..రా.....యణ ..!


సంస్కారవంతమైన విద్యావిధానాన్ని పక్కా వాణిజ్య పంధాలో కి ....నెమ్మదిగా...మాఫియా స్థాయిలోను నడిపీ....కొన్ని ’విధ్యాసంస్థలు’ అనబడే కంపెనీలు కోట్లు కొల్లగొడుతున్నాయి. విద్యార్థులను ’హరినారాయణులు’గానూ, ’చైతన్యవంతులు’గానూ తీర్చిదిద్దుతామని నమ్మబల్కి ఆనక వారి గార్డియన్ల జేబులకి చిల్లులూ-పిల్లల భవిష్యత్తుకు తూట్లూ పొడుస్తున్నాయి. ఫలితాలు వెలువడ్డం తరువాయి యెడా పెడా ప్రింట్ అన్డ్ ఎలక్ట్రానిక్ మీడియాల్లో సోకాల్డ్ విజయాల్ని చాటుకుంటే...అయినా వీరి వాణిజ్య గోలలకి పడిపోక...అసలు పట్టించుకోని  జనాలని చూసి...అయోమయంలో పడి....చివరకు ’వాణిజ్య ప్రకటన’ పేరుతో ’ఆదివారం అనుబంధాల్లో’ సెంటర్ స్ప్రెడ్ వార్తాకధనాలు రాయించుకునే దుస్థితిలో ఉన్నాయా కార్పొరేట్లు!!
ఈ వాజమ్మలంతా.....ఇంద్రుడూ, చంద్రుడూ, మహామనీషి,విద్యావేత్త, మార్గదర్శి...లాంటి చమక్కులతో  వాణిజ్యవార్తలు రాయించుకుంటున్నారు. ఇలాటివన్నీ గొబెల్స్ ప్రచారాలై...జనరేషన్ల తర్వాత నిజాలై కూర్చుంటాయి. అందుకే ఈ నాలుగు ముక్కలూ రాస్తున్నాను. నిజానికి వీళ్ళ ధ్యేయం కోట్ల ఆర్జన తప్ప....విద్యాదానమూ-మట్టీ ఏం కాదు. కూలి నాలీ చెసుకునే వాడు కూడా చక్కగా చదువుకునే పాఠశాలలకు స్థానం లేకుండా - చదువు"కొనే’ స్థాయులకు తీసుకు వెళ్ళిన వాణిజ్య బకాసురుల చేతిలో సరస్వతీమాత విలవిల లాడుతోంది. విద్య ’అంగడి సరకు’గా ఎప్పుడో మారింది. పది రూపాయలకు దొరికే తెలుగు అకాడమీ పుస్తకాలు కాపీలు చేసుకుని కొత్త అట్టలు వేసుకుని వేలాది రూపాయలకు మళ్ళీ కార్పొ’రేట్’ విద్యార్ధులకే  అమ్మి కోట్లు గడించిన వైనం ఆ మధ్య మీడియాలో దుమారం లేపింది. మళ్ళీ ’వాణిజ్య’సూత్రాలననుసరించి....ఆ ’కాపీల’ వెనుక ’కూపీలు’ లాగలేక పోయింది ప్రభుత. అక్రమార్కానికి మార్కులువేసి .....వాతాపి జీర్ణం....అనిపించుకుంది. "మాఫియా" అని అందుకే అనాల్సొస్తుంది బాధతో!!
అసలు ఈ డబ్బా కాలేజీలు విద్యావికాసానికి చేసే మేళ్ళు శూన్యం! ఆల్రెడి టాలెంటెడ్ విద్యార్ధులను నయానో భయానో ’కొని’ వాడి టాలెంట్ కు పేటెంట్ మేమే అని చెప్పుకోవడమే వీళ్ళ నిర్వాకం. అక్కడాగితే పర్లేదు. ఓ మోస్తరు విద్యార్ధులను కూడా అసలు పట్టించుకో పోగా....భారీ పీజులతో గుంజీలు తీయించడం అమానుషం.  ఆమధ్య ఓ విద్యార్ధినిని వీళ్ళ గురించి అడిగితే ఇలా అంది. "ఇందులో చేరిన వాళ్ళు - రిచ్ బికం రిచ్...పూర్ బికం పూర్!!!"   పిల్లలకీ-రిచ్నెస్కీ సంబంధం ఉందిగానీ ఈ అమ్మాయి కోట్ అంతగా అర్ధం కాలేదు. అదే అడిగాను ఆ కోట్ మీనింగేంటని. "ఇంకా డైరెక్ట్‌గా ఏంచెప్పాలి ఆంటీ...రిచ్ టాలెంట్ కనిపిస్తే లాక్కుని హాస్టల్లో పెట్టి, ఫుడ్డు పెట్టి, పీజు కట్టి....ఓ నలుగురు లెక్చరర్లు వాణ్ణి పట్టుకుని తలంటి పోసి రుబ్బి “ఙ్యాన సముపార్జన" చేయించి ఐఐటీ వీరుణ్ణి చేసి చూపిస్తారు. ఈ పూడిక ..... మిగిలినోళ్ళదగ్గర్నుంచి లక్షలు లక్షలు వసూలు చేసి ....... సబ్జెక్ట్‌లో చిన్నపాటి సందేహాన్నికూడా నివృత్తి చేయరు. చివరికి వాడు ’మాణిక్యం’ అవుతే - వీడు ’మట్టి’ అవుతాడు ! వేరేచోట చదువుతే కనీసం ’మట్టి’ గానీ ’సినిక్’గానీ అవడు కదా.... అదీ నా కోట్ కి అర్ధం " అని చెప్పి ఉస్సురంది.
26.5.11 ఈనాడులోని వార్త ప్రకారం...కేవలం ఐ ఐ టీ కోసం - ఒక్కో విద్యార్ధికీ సగటున రెండేళ్ళ శిక్షణకు కనీసం రూ.40,000 చొప్పున దేశవ్యాప్తంగా 1600 కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనాట.  రెండేళ్ళ బదులు ’ఏడేళ్ళూ’ (సోకాల్డ్ ఇంటెగ్రేటెడ్ కోర్స్), ఏడాదికి ’లక్ష’ చొప్పున చూసుకుంటే......ఈ వ్యాపారం రూ.56,000 కోట్లకు చేరుతుంది. త్వరలో ’లక్షకోట్లకు’ చేరినా ఆశ్చర్య పోనక్కరలేదు. ఇలా కోట్లు కొల్లగొట్టి  విద్యని మాఫియా చేసిన ’మార్గదర్శులని’ సరస్వతి మాఫీ చేయదుగాక చేయదు. "వీళ్ళకా అవార్డులిచ్చేది...నడ్డివిరగ్గొట్టక..." అని నిలదీస్తున్నారు పేరంట్స్ అసోసియేషన్స్.  అయినా ఈ మార్కెట్లో ప్రశ్నించిన పేరెంట్‌దే నడ్డివిరుగుతుంది. వాళ్ళ పిల్లలు ఉదాసీనతకు గురి కాబడుతున్నారు. మార్గదర్శులు మాత్రం కోట్ల ధనరాశులమీద కూర్చుని రెండు వేళ్ళెగరేసి విజయచిహ్నాల్ని చూపుతున్నారు. ప్రభుత కొంగ జపం చేస్తోంది.
వంద రూపాయల ఫీజుతో మేం చదువుకున్న రోజుల్లో- నడిచో,స్కూలు రిక్షాలోనో వెళ్ళీ - ఎకరాల స్థలాల్లో ఉన్న స్కూళ్ళల్లో చదివేవాళ్ళం. మాకు 9వ తరగతిలోనే ల్యాబ్‌లో ’పిప్పెట్టు’ ’బ్యూరెట్టు’ లాటివి చూపేవారు. ఇప్పుడీ డభ్భా కార్పొ’రేట్స్’లో....ఇంటర్ రెండో సంవత్సరంలో కూడా....పొటెన్షియో మీటర్,గాల్వనోమీటర్ కనీసం ఆమ్మీటర్ లాటివి కూడా చూపుకు నోచుకోలేక పోతున్నారు విధ్యార్ధులు ఆ ఇరుకు గదుల్లో!!  క్రీడల విషయం అయితే చెప్పనే అక్కర్లేదు. ’విద్యావేత్తలనబడే’ వాళ్ళు సిగ్గుతో తలవంచుకోవాల్సిన సందర్భం ఇది. వీళ్ళని గుడ్డలిప్పదీయకపోగా....దయచేసి రత్నాలనీ....మార్గదర్శులనీ....పెయింట్ వేయకుండా ఉందామా?

13, జులై 2011, బుధవారం

ముందుకు పోయింది ’జానెడేనా’...?

విషుగూ విరామం లేఖుండా షర్షలు షేషీ షేషీ...విషుగొష్చి విషుగొష్చి షర్చని షర్చగానే వదిలేడ్డామని బేషరతుతో రాష్ట్ర షాఢన దిషగా మున్ముందుకు పోవాలని.......

19, జూన్ 2011, ఆదివారం

పిత్రుదేవోభవ

పాట్రియార్కల్ భావజాలమ్ లాటి పదాలు వదిలేస్తే....ఫాదర్స్ డే కూడా ఇప్పుడు సమాజంలో బాగా పండుతోంది. పిత్రుదేవోభవ-కాన్సెప్ట్ పురాణేతిహాసాల్నించీ ఉంది. అదలా ఉంచి ’నాన్న’ని స్మరించుకునే అవకాశం వచ్చింది గాబట్టి- నాన్న కవితాసంకలనం కొని చదవదగ్గదని ఇలా ముఖపత్రాన్ని               చూపిస్తున్నా....                    












 అందులోనే..... పరమపదించిన వర్చూ ’నాన్న’ని  తన  కవితలో చూడచ్చు.























                                                                 

వంటా-వార్పూ


14, జూన్ 2011, మంగళవారం

మనిషి మెదడు చిక్కుతోంది

మనిషి మెదడు చిక్కుతోంది.... ...........  ..............  -కేంబ్రిడ్జ్ శాస్త్రవేత్తలు.(నేటి ఈనాడు)

బహుశా ఇలానేమో 

                                                                

11, జూన్ 2011, శనివారం

తెలంగాణా కి 'అడ్డం'-'నిలువూ'............

కేసీయారే అసలు ’అడ్డంకి’ అని తేల్చిపారేశారు తెదేపా తె.ఫోరం తాండూరు రణభేరిలో.
అసలు ఈ ’అడ్డంకి’ గురించి ఒక్కో పార్టీ ఒక్కో సారి తేల్చిపారేశేసారు వివిధ సందర్భాలలో. ఓవరాల్‌గా ఈ ’అడ్డం’ లేదా ’నిలువు’వివిధ నాయకుల్లో ఎలా జీర్ణించుకుందో ఇలా ఉంటుంది అనిపిస్తుంది. మన విగత ముఖ్య మంత్రి వైయస్సార్ : బాబూ! నేను ’అడ్డమూ’ కాదు ’నిలువూ’ కాదు.
కీసీయార్ : (అప్పట్లో)అసలు వైయస్సారే పెద్ద ’అడ్డం’.(ఇప్పట్లో)సీమాంధ్ర నాయకులే ’అడ్డం’.
బాబు     :అసలు ’అడ్డాలకీ’ ’నిలువుకీ’ మా పూచీ లేదు. కాంగ్రెస్ మాత్రమే దీనికి ’అర్ధం’ చెప్పాలి.(అయితే ’అడ్డం’ ఓ కన్ను-’నిలువు’ ఓ కన్ననీ మాత్రం చెప్పగలం.
నాగం     : అప్పుడు ’అడ్డం’ ఇప్పుడు ’నిలువు’.
సీపీఐ     :ఇడ్లీలో ’అడ్డం’గా ’నిలువైన’చికెన్ ముక్క నంజుకోటం తప్ప నాకు ఇతర అర్ధాలు తెలీవు.
సీపీయం  : అసలు మా వంశమే ’నిలువు’. అప్పుడప్పుడూ పరిస్తితిని బట్టి ’అడ్డం’ తిరగడంలో తప్పులేదు.
హరీష్    :  మా కుటుంబం తప్ప అందరూ ’అడ్డాలే’
జగన్     :అన్నింట్లో మా ’అయ్యే’ ఆదర్శం. ఆయన కల్లో కోచ్చి ఏది చెప్తే అదిచేసి పెడతాం. అయినా పిల్లోణ్ణి పట్టుకు ఇదా అడగడం?
చిరు      :మెగాలుక్ రావాలంటే ’నిలువే’ బెటర్. ’అడ్డమైతే’సినిమాలే బెటర్.
బీజేపీ    :మిగతా రాష్ట్రాల్లో ’నిలువు’గా ఉండి, ఇక్కడ ’అడ్డం’ అని ఎందుకనుకుంటాము. అయితే మీరంతా ’అడ్డం’ తప్పుకోండి, నిలువు’గా పనిచేసి పెడ్తాం. (లేక పోతే ’అడ్డమే’)
డీయస్   : అసలు నాలుక్కే ’అడ్డం’. అయితే అమ్మదయ ఎలా ఉంటే అలా.
బొత్స      : నేను ’నిలువు’గా కనిపిస్తూ ’అడ్డం’గా నరికేస్తా.
సోనియా   : వైయస్ కి డీయస్ ని ’అడ్డం’ పెట్టాను. కిరణ్ కి బొత్స ని ’అడ్డం’ పెట్టాను. ఒకసారి ’నిలువు’కు కమిట్ అయితే మిగతా దేశం అంతా ’అడ్డం’గా నరికేస్తారు ప్రజలు.

9, జూన్ 2011, గురువారం

గీత-గీతి (పెయింటింగ్ మాస్ట్రో ...ఇక 'ఫిదా'ఫిజ్....!!)






నిండైన జీవిన 'చిత్రం'....!
ఆర్టిస్టులూ-అనార్కిస్టులూ
ఇద్దరూ ఫిదాయైన పికాసో పికం...!!
రంగురంగుల ప్రపంచం మాయమై
నల్లగా మిగిలిన శోకం....!
మన హుస్సేన్ అస్తమయం...!!




(నాకు నచ్చిన కామెంట్ ఇక్కడ చదవచ్చు-కృష్ణశ్రీ గారి సౌజన్యం తో)

5, జూన్ 2011, ఆదివారం

మ్యాంగో షో-2011

  • మ్యాంగో షో-2011చాలా పసందుగా జరుగుతోంది ఎగ్సిబిషన్ గ్రౌండ్స్‌లో!


  • దాదాపు రెండు వందల రకాల మామిడి పండ్లతో ప్రదర్శన అపురూపం! అలాటి వాటిలో ఒకటి అతి చిన్న-అతి పెద్ద మామిడి పళ్ళు నన్నాకర్షించాయి.చిన్నది(దేశవాళి)  24 గ్రా.కాగా, పెద్దది (ఏనుగు తొండం) 2.4 కిలోలు. అవి ఇవిగో!
  • పండు పేరు ’ఏనుగుతొండం’ కాగా యాద్రుచ్చికంగా అదే మైదానంలో కొన్ని ’ఏనుగులు’కనిపించాయి. వాటి ముందు మా బబ్లి ఇలా ఫోజిచ్చాడు.
  • మీరూ సరదాగా ఓ లుక్కేస్తారు కదు!

30, మే 2011, సోమవారం

ఇంద్రగంటి జానకీబాల గారి అద్భుత శైలిలో సాగిన ’కనిపించే గతం’

  • పాత పుస్తకాలూ, దినపత్రికలూ లాటివి కొన్ని పేపరువాడికి అమ్మేస్తుంటే - ఎప్పుడో ’వార్త’ డైలీలో సీరియల్ తాలూకు భద్రపరచబడ్డ క్లిప్పింగ్స్ బయట పడ్డాయి.
  • 28.8.2000(సోమవారం) ’వార్త" దినపత్రికలో మొదలైన ఆ డైలీ సీరియల్ (ఓ 42 రోజులు  వచ్చిందనుకుంటా-నాకు 42 క్లిప్పింగ్సే దొరికాయి.)  పేరు "కనిపించే గతం". రచయిత్రి - ఇంద్రగంటి జానకీబాల.
  • రచయిత్రి పరిచయంలో...ఆవిడ నాలుగు కధా సంపుటాలూ, తొమ్మిది నవలలూ, ఒక కవితాసంపుటీ వెలువరించారని ఉంది. వీటిల్లో ఏ ఒక్కటీ చదవకపోవడంచేత ఇదైనా చదువుదామని కూర్చున్నాం గత వారాంతపు ’తీరుబాటులో’.
  • ప్రధమ పురుషలో సాగే సీరియల్....జాతిపిత బాపూజీ మరణించిన రోజుకి మూడేళ్ళ వయసు చిన్నారి ’దేవకి’తన బాల్యం నేపద్యంతో రాసుకున్న నవల. తన బాల్యపు 'నిరుపేద బ్రాహ్మణ' జీవన విధాన రీతి....భీతి......ఇంకా ఆ రోజుల్లోని చిరు ఆనందాలూ, ఆడంబరాలూ, ఆర్భాటాలూ, అచ్చట్లూ, ముచ్చట్లూ, ఖేదన రోదనలూ...వగైరాలతో......సాదా సీదా శైలిగా కనిపిస్తూనే.....అనితరసాధ్యపు శైలిలో తీర్చిదిద్దారు రచయిత్రి. ప్రధమ పురుష వాడడం, వాస్తవికతా చిత్రీకరణ .... వీటితో ’ఆత్మకధేమో’ అనిపిస్తుంది. కావచ్చు-కాకపోవచ్చు. అయితే- ’ఆత్మకధ’ కాకపోయుంటే ఇంత గొప్పగా రాయలేరు సుమా -అనిపిస్తుందా కధాసరళి.  
  • అప్పట్లో...కాసిని కాఫీ నీళ్ళు పొయ్యిమీద ’పడేయడం’.....కుంపటి రాజేసి....పొగ గొట్టంతో ఊదటం....అరుగుమీద కూర్చుని పనీపాటా లేక కూని రాగాలు తీసే ఇర్రెస్పాంసిబుల్ తండ్రి.....నెలకి నలభై రూపాయల జీతంగల టీచరమ్మ.....పిల్లాజల్లా తో జట్కా బండిలో కాకరపర్రు ప్రయాణం.....ఇలా ఎన్నో ఈతరంవాళ్ళకి తెలీని ముచ్చట్లతో....అద్భుత శైలీ గమనంతో చదువరులనాకట్టుకుంటుందీ నవల. దీనికి తప్పకుండా పుస్తక రూపం వచ్చుంటుంది కాబట్టి.....దొరికితే తప్పకుండా పుస్తకప్రియులు చదవాల్సిన పుస్తకం!

26, మే 2011, గురువారం

బూతులు రాస్తే మార్కులు వేస్తారేమో....!!

  • మా పాపవి ఫస్ట్ ఇంటరు ఇంగ్లీషు మార్కులు 95-98 మధ్య  ఎక్స్పెక్ట్ చేస్తే 84 వచ్చాయి. ఎందుకు తగ్గాయో....రైటింగ్ బాలేదా...ప్రశ్నలు వదిలేసిందా...  అని ....రూ.600/- కట్టి రి-వెరిఫికేషన్చేయించాను.ఇలా సమాధానం వచ్చింది.

దీంతోనే  వాళ్ళు బదులుగా     ఆన్సర్ షీట్ 'నకలు' పంపించారు. (ఒక పేపరుకు అంత కట్టించుకుని -రీ-కౌంటింగ్, రీ-వెరిఫికేషన్ మాత్రమే చేస్తారుట. ’రీ-వాల్యూ’ చేయరట.)
  • సరే...తర్వాత ఆన్సర్ షీట్ చూస్తే తెలిసింది.  ముత్యాల్లా రాసింది అన్ని పేజీలూ.  అన్ని చోట్లా 'కరెక్ట్' టిక్ మార్క్స్ పెట్టి ఉన్నాయి. ఒక చోట 'రౌండు' పెట్టాడు . రెండు బిట్లు (  1/2+1/2 =1 mark) తప్ప అన్నీ కరెక్ట్ గా ఉన్నాయి. కానీ అన్నింటిలోనూ ఇష్టారాజ్యంగా తగ్గించుకుంటూ మార్కులు వేయడం వల్ల అలా తగ్గయని తెలిసింది.  ఆ 'రౌండు' పెట్టిన పేజీ ఇలా ఉంది.......


   సెక్షన్ A లో క్వశ్చన్ b లో అన్నొటేషన్ రాయాలి. నాలుగు మార్కులన్న మాట. ఆ ‘Banglore’ లో స్పెల్లింగ్ తప్పయిందట. టెక్స్ట్ బుక్ లో 'Bangalore' అనుందట. ఓ మార్కు 'కట్'. చక్కగా ఆన్సర్ చేస్తే ఇలా ఉంటాయి. అసలు ‘Banglore’ నౌన్ అయినప్పుడు ఎలా రాస్తే యేం!  Hydrabad అనున్నా Hyderabad అనున్నా నౌన్ లో మార్క్స్ కట్ చేయరు. చెయగూడదు.వాళ్ళ టీచర్ కి చూపిస్తే ‘దీనికి...... నేనైతే  93 మార్క్స్ వేస్తానమ్మాయ్’అందట.
  •     ఇంతకీ .......బండ బూతులు రాస్తే .....'సగం' మార్కులేస్తారు. చక్కగా రాసినా మరో మార్కు ఎక్కువేస్తారు. అంతే.....సో......పిల్లకాయ్‌లూ.... అనుకున్నదానికన్నా కొన్ని మార్కులు తగ్గాయని మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గించుకోకండి. మందుకొట్టి వాల్యూ చేశేవాళ్ళూ ఉంటారు. డోంట్ గెట్ డిసప్పాయింటెడ్!

22, మే 2011, ఆదివారం

రచనాజ్వాలలతో చమక్కుమంటున్న ’బ్లాగుబావుటాల ’కి జేజేలు!!

  •     బ్లాగుల్లో ’కవిత్వం’- ఆ మాటకొస్తే ఏ  ’సాహితీ వ్యాసంగమైనా’  తామరతంపరగా విస్తరించడానికి కారణం "ప్రచురణా వేగం"! నత్తనడక టపాలు (స్నైల్ మెయిల్) రోజుల్లో ఓ స్టాంపు లేదా బ్రాండ్ పడినవాడు రాస్తేనే ’కవిత్వం’పత్రికాధిపతులకి! మరోడు రాస్తే ’కపిత్వం’!! బుట్ట దాఖలు. వెలుగు చూసిందే కవిత్వం. ఇంక ఎవడు రాసి ట్రంకు పెట్టెలో పెట్టుకుంటాడు ఏ సినిసిస్టో, రీసర్చి స్కాల్రో తప్ప. గతం గతః
        బ్లాగ"రిస్టుల" అంతర్జాలమధనాలలో, జాలాఘాతాలలో ’పత్రికాగ్రేసరుల’కత్తెరలు తుత్తినియలయ్యాయి. చిత్తుబుట్టలు అటకలెక్కాయి. సదరు సంపాదకులు ’కంటెంట్’ సంపాదనకు - సామాన్య రచయితలకై అసామాన్యరీతిలో శోధనావేశం చూపిస్తున్నారు! రచనా సృష్టికి పుష్టికి ’ఆర్భాట శూరత్వం’కానీ ’పీయార్’టాలంటులు కానీ పడికట్టు రాళ్ళు కావనీ ’సృజనాత్మక వైచిత్రే’ముఖ్యలక్షణమనీ గుర్తెరిగి బ్లాగ్లోకానికి మల్లెపూదండ వేస్తున్నారు. కొత్త కొత్త రచయితలని వీళ్ళేమాత్రం అడ్డుకోలేక పోయారు. శవ రచనలకి పూజలు మానుకోవాల్సొచ్చింది. కొత్తబంగారు లోకం వీరి చెత్తబుట్టల్ని తిరిగి వారి చెత్తబుర్రల్లోకే నెట్టింది.  అయితే ’స్నైల్ మెయిల్’ పోయి ’ఈ మెయిల్’ ఎక్కాల్సిన "ప్రచురణార్ధం పంపించే రచనలు" ఇంకా తపాలా ద్వారా పంపించే ఖర్మ రచయితలకెందుకో అర్ధం కావటంలేదు. ఆ తపాలా మూటల్ని తపోవనంలో మగ్గపెట్టబడి ఆనక ఎప్పుడు ఆవిష్కృతమౌతాయో తెలీని పరిస్థితి.
  •     పత్రికల సంగతి ఇలాఉంటే కొన్ని ’సాహితీ పీఠాలో’ ’కవితా సమితులో ’ ’కల్చరల్ ట్రస్టులో’ మరోటో - కవిత్వం పంపుకో- దాంతో వంద రూపాయలు (జోకేంటంటే - దాంతో సరిపడేన్ని పోస్టల్ స్టాంపుతో సహా) వదిలించుకో - ఏళ్ళూ పూళ్ళు ఎదురుచూస్కో - రిప్లయి రాకపోతే మూస్కో) తరహాలో రెచ్చిపోవడం - ఓ బిజినెస్స్ అందామా! ఆఖరికి ఏ గుడి వెనకాలో మునిసిపాలిటీ మార్కెట్ మూలనో ఓ ’టేబుల్ సభ’ పెట్టి నోబుల్ గా క్రతువు ముగించేయడం ఎవరికి తెలీదు? ఆ టక్కులమారి ట్రస్టేశ్వర్రావులు మాత్రం కాలగమనంలో ’సాహితీ సామ్రాట్’ ’సభా విరాట్’ వగైరా బిరుదాంకితులై అలరారుతూంటారు. అది వేరే సంగతి.
  •     ఈ సాహితీ ముష్కరత్వానికి పిండప్రదానం చేసి  రచనాజ్వాలలతో చమక్కుమంటున్న ’బ్లాగుబావుటాల ’కి జేజేలు పలుకుతున్నా.....అంతర్జాల సాహితీ విశ్వంభర కి రెండుచేతులెత్తి నమోవాకాలర్పిస్తున్నా!!

18, మే 2011, బుధవారం

రంభాయూర్వశి లేదనబోకు.

నాయనా స్టీఫెన్ హాకిన్సూ..!
భూమి గుండ్రంగా ఉందనబోకు!!
రంభాయూర్వశి లేదనబోకు.
మరమనిషికీ-మనసుమనిషికీ
మీట నొక్కిన పిమ్మట చిమ్మచీకటేననబోకు.
వందల సిద్ధాంతుల మధ్య కొత్త సిద్ధాంతమిదియేయని
రాధ్ధాంతం చేయకు..!!
మాకు కో అంటే కోటి దేవుళ్ళున్నారు.
వందల కోట్ల సెంటిమెంట్లను
లక్షల కోట్ల వాణిజ్యాల్ని
చల్లగా కాపాడే భావోద్వేగాలనూ
చిల్లర అంశాలతో
చల్లటి వ్యవస్థని చిలకబోకు....!!
 మాకు తెలిదన్నట్టు
కొత్తగా చార్వాకపర్వం విప్పబోకు !!


15, మే 2011, ఆదివారం

పెట్రో కుట్ర








ఎలక్షణాలు అయిపోయి క్షణం కాలేదు!
పాలకుల లక్షణాలు బయట పడ్డాయి.
ఓటరు నెత్తిన పెట్రో కుట్ర బండలు పడ్డాయి!!

'cry'toon-Petrol








Hike of the petrol just after closure of elections to the five states is being viewed so seriously by the populace and also viewed as nothing short of CHEATING the citizens by the UPA Government at the helm of affairs.
            As per reports in hand with Mr.Chandrababu Naidu, the Center hiked 20 times in last 7 years (Rs.33 per lt. hike in all) and 10 times in last 1 year and thus garnered Rs.4000000000000/- in the last 4 years. (Four lack cr.)

10, మే 2011, మంగళవారం

హైట్ ఏంటంటే... ఏది "పరమోత్తమ చుంబనం" ఏది "పరమోత్తమ ఐటం సాంగ్" లాటి "పోటీ"లు పెడుతున్నారు


                                 అనగనగా ఓ ఆస్ట్రేలియన్ సుందరాంగి మోడల్ - తన బికినీ మీద మన హిందూ దేవత లక్శ్మీదేవి బొమ్మ వేసుకు తిరిగిందట. ఇవి అనగనగా ఓ హిందీ డైలీ లో అచ్చైనవిట. హన్నన్నా! ఎటు పోనిస్తున్నాం....!! ఈ తరహా విపరీత చర్యలు లోగడ చాలా చూశాం.చదివాం. ఏ భగరంగ్ దళ్ లెవెల్ గ్రూప్సో డౌన్ డౌన్ అంటం కూడా చదివాం. (ఇది ఏ ఒకళ్ళకో కాక గుడ్ సిటిజన్లందరూ  ఖండించాల్సిన విషయమని  నా భావం)
    హర్షించదగ్గ న్యూసేంటంటే - గౌ"అలహాబాద్ కోర్టు వారు దీన్ని "హిందువుల మతభావజాలాన్ని అవమానించే చర్య" గా పిల్ కింద సుమోటో కేసు గా తీస్కుంది నేడు.  శభాష్! అసలు ఒక మతాన్ననే కాదు- ఏ మతానికైనా ఇలాటి విక్రుత చర్యలు వాంఛనీయమని ఎవరు అనరు. పైగా మహిళా దేవత చిత్రాన్ని మహిళే.....!! రామ రామ!!
ఆ మధ్యన ఓ చానల్లో "ముద్దు" మీద థర్టి మినిట్ ప్రోగ్రాం దుమ్ము దులిపేసింది. "ముద్దు వద్దని" కాదు. "ముద్దు ముచ్చట్లిలా" ఉంటాయని. ఇంకేం "కంటెంట్" తో కుమ్మొచ్చు. తర్వాత మిగతా ఛానల్స్ కూడా నేను సైతం అంటూ ముద్దు స్టోరీలు వండి వార్చాయి. గ్రేట్నెస్ ఏంటంటే...సదరు ప్రోగ్రాంలకి ఫిమేల్ ఆంకర్సే "రసానుభూతి" తప్పకుండా లయవిన్యాసం చేస్తూ ప్రెసెంట్ చేస్తారు. బాంది కదా!! (తర్వాత కొన్నాళ్ళకి బ్రెస్ట్ -  సారీ - బెస్ట్ ఆంఖర్ అని ఏ అభినందన సన్మాన - శాలువా సత్కారం ఇచ్చి గౌరవించుకుంటే మనం చప్పట్లు కొడతాం -  అది వేరే సారి బ్లాగుతాను) పూర్వాశ్రమం లో -  సినిమాల్లో "బూతంతా" చూపించి ఆఖరున "ఇలా" ఉండగూడదబ్బాయ్ అని ముక్తాయించేవాళ్ళు. ఆ రోజులు పోయి టీవీల్లో ఇప్పుడు "బూతంతా" చూపించి నేటి "ట్రెండ్" అని సెలవిస్తున్నారు. మనం "గామోసు" అనుకుంటాం! ఇదేదో ఒక వేవ్ క్రియేట్ చేసి ... వెండి తెర మీద "లిప్ లాక్" ని బాహాటంగా చూపించటం "నేరం" కాదు....అతి సహజం అనే ధోరణి ప్రేక్షక లోకంలో చొప్పించే ధోరణి ఈ మధ్య మీడియాలో కనిపిస్తోంది.  ఈ కోవలోకే వస్తున్నాయ్ ఈ మధ్య కనిపిస్తున్న కొన్ని వార్తా ప్రకటనలు. హైట్ ఏంటంటే... ఏది "పరమోత్తమ చుంబనం" ఏది " పరమోత్తమ ఐటం సాంగ్" లాటి "పోటీ"లు పెడుతున్నారు ఇదిగో ఇలా.....
    


24, ఏప్రిల్ 2011, ఆదివారం

ప్రేమస్వరూపుడు శ్రీసత్యసాయి మహాభినిష్క్రమణం!



కొద్దిగా తడపమని కరువుపీడిత సామాన్యుల గొంతుకలడిగితే
సుజల స్రవంతులనిచ్చావ్!
శాంతీ-వాత్సల్యాలు కొరవడి కరువాచిన తరుణంలో-
ప్రేమాంమృతం పంచకుండా అలా ఎలా ఎగిరిపోయావ్ శాంతి కపోతమా?

23, ఏప్రిల్ 2011, శనివారం

ఎవడు యాగం చేస్తే దిమ్మదిరిగి మైండ్ బ్లాకై చీలిపోద్దో......

ఎట్టకేలకు తెబ్రాలు పరమ సక్సెస్ ఫుల్ గా వేర్పాటై మే 1 న 'తెలంగాణా అర్చక,బ్రాహ్మణ శంఖారావం' చేస్తునారట. శుభంభూయాత్! బ్యానర్ పేరు:తెలంగాణా బ్రాహ్మణ ఐక్య కార్తాచరణ సమితి. ప్రదేశం: దోమలగూడా లోని ఏ.వీ.కాలేజ్ మైదానం. సమయం: సా.4 గం; సభాప్రముఖులు:కేసీయారు,కిషన్ రెడ్డి (ఊహించినట్టే.... షరా మామూలే)(కోదండరాం - గద్దరు బాచుంటుందో- సంఘపరివారముంటుందో అప్పుడే తెలీదు-మనకి! ఇవి మున్ముందు వేరే ’పరిణయాలకు’ (పరిణామాలకి కాదు) దారితీయచ్చు-పాపం మంత్రి శ్రీధర బాబు ని పిలిచుంటే, ఏం మాట్టాడమని అడుగుతారో చూడాలి) అదలా వుంచి-నాకు తెలిసి ’బ్రాహ్మణ సేవాసంఘ సమాఖ్య (ఈస్ట్ జోన్) (మిగతా జోన్ల సంగతి తెలీదు) అని ఆనందబాఘ్,ఖైరతాబాద్ లోనూ, మరో ఆఫీసు శాతవాహన నగర్, వనస్థలిపురం లోనూ ఉంది. ఈ కొత్త సమాఖ్యకీ పాత సమఖ్యకీ కోర్డినేషన్ ఉందో లేదో మనకనవసరం.
అయితే ఒక విషయం నన్ను బాగా కదిలించింది. ఎవడు యాగం చేస్తే దిమ్మదిరిగి మైండ్ బ్లాకై చీలిపోద్దో ఆడి చేత చీల్పించుకున్నది - ఆ యాగం చేసిన బుధజనమే అయుండడం. కన్ఫ్యూసింగా ఉందా! పర్లేదు. వదిలేద్దాం. అసలింత వీజీగా .....సునాయాసంగా....సంఘటితం కావలసిన తరుణంలో..... ఒక ’కులం’ ప్రాంతీయంగా చీలికకి గురి కావడం బహుశా 'ప్రపంచ కులాల్లోనే' సంచలనం కలిగించేదే. గిన్నీసు తరహా గిన్నెలో ఒదగదగ్గదే. ఏదేమైనా ’సర్వేజనా సుఖినోభవంతు’ అనేది మా లక్ష్యం గా ...... ఒకటి చెప్పాలనుంది. అదేంటంటే - "పదవులు మాకు - సామూహిక ఉపనయనాలు,పెళ్ళిళ్ళూ మీకు" అనే ఎజెండా నించి సమాఖ్య పెద్దలు దూరంగా ఉండాలి. ఈరోజు నుంచి 100 రోజుల తర్వాత సగటు 'పేద బ్రాహ్మణుడి' కి ఏమాత్రం సేవ చెస్తారో చేయిస్తారో చూసి బ్లాగుతాను.బాయ్!

17, ఏప్రిల్ 2011, ఆదివారం

"తెబ్రా" లకన్నా "ఆంబ్రా"లకు "ఆ-డంబరం" ఎక్కువ.

ఆంబ్రా (ఆంధ్రా బ్రాహ్మణులు) లకు "ఆడంబరము" జాస్తి. తెబ్రా(తెలంగాణా బ్రాహ్మణులు)లకు ఈ తీట లేదు అని లేటెస్టుగా శతచండీయాగకర్త యాగం లో భాగంగా _ వాక్రుచ్చారు అనేకంటే ఉద్బోధించారు అంటే బావుంటుంది! ఆహా! ఏమి యాగఫలము? అసలే బ్రాహ్మణ జాతి ఇంటి పోరుతో,ఆకలి పోరుతో చిక్కి శల్యమవుతుంటే ఇది మరో చీలికాస్త్రం కాదా అంటున్నారు బుద్దిజీవులు. అయినా ఆయన చేస్తే "యాగం" గానీ "ఆగం" గానీ ఏదో ఒహటి ఔతుంది అనేది ప్రాచుర్యమే కదా! అదటు వుంచి...గుక్కెడు మంచినీళ్ళ కోసం ప్రాంత జనాలు జీవితాల్లో ఉగాదులు లేక గోలెడుతుంటే చేయూతకు బదులు యాగాదులు చేయ కడుంగడు శోచనీయము కాదాయనిన్నీ, ఇయ్యట్టిది " ఆడంబరమో " ఏ "డంబరమో" యని ఆక్రోశించుట వీరి శ్రవణములకు సోకలేదాయని ప్రజలు పరిపరి విధముల భావించుచున్నారు.
రెండు. బ్రాహ్మణుల మీద అంత వాత్సల్యము కలిగినయడల_ తాను "నిమిషం" కూలీ చేసి "లక్ష", గంట పనిచేసి "కోటి" పుచ్చుకున్నట్టు, సదరు బ్రాహ్మణుడు "నమకం" చెప్పి లక్షా "చమకం" చెప్పి రెండు లక్షలు అడిగితే వారు సమర్పించుకోడానికి రెడీయా? లేక మరో వేర్పాటుకు ఏర్పాటు చేస్తారా?

15, ఏప్రిల్ 2011, శుక్రవారం

ఏ కర్తవ్యం - ఏ బాధ్యతా లేకుండా నెలకు లక్ష పైచిలుకు జీతం (ఇహ బ్లాక్ లో చెప్పలేనన్ని కోట్లు......)

అంత ఆశ్చర్య పడకండేం...నేటి ’టైమ్స్ ఆఫ్ ఇండియా 9 వ పేజీలోని ఓ వార్త సభ్య సమాజం ఆర్ధిక వ్యవస్త సిగ్గుపడేలా చేస్తుంది. మనం ఏరి కోరి ఎన్నుకునే ప్రజా నాయకుల కి - అసలు పనేంటి...పాటేంటి...గీతమొదిలేసి జీతమెంత ...? లాటి వివేకవంతమైన ప్రశ్నలే ఓ క్రియాశీల వ్యక్తి ఐన దేబషీస్ భట్టాచార్య కి కలగడం, ఆ వెంటనే 'ఆర్టీఐ' పుణ్యమా అని.... ఎలక్షన్ కమీషన్ కు మొరపెడితే అది ఎలా ప్రయాణించి చివరికి ఎక్కడెక్కడికో తిరిగి...చివరికి.... అసలు ఎమ్పీ , ఎమ్మెల్యే లకు "న కర్తవ్యం-న బాధ్యత" అని తేల్చి చెప్పారుట ... ప్రభుత్వం వారు... అదేదో "న భయం-న లజ్జ" అనేది స్పురించేట్టు. పూర్తి సమాధానపు ’బంతి’ ఇంకా న్యాయ మంత్రిత్వ శాఖ 'కోర్టు' లో ఉందట. సదరు వార్త టెక్స్ట్ ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను.
NEW DELHI: What are the duties and responsibilities of members of Parliament and state legislative assemblies? Actually nothing!

A series of RTI queries filed with the central government and state assemblies show that there are no duties and responsibilities for elected representatives of the people. The only exception may be Sikkim, where the assembly has rules of procedure "specifying the duties (and) responsibilities of MLAs towards the august House being public representatives" and it would be their "prime duty to maintain communal harmony and peace among the people".

On February 2, 2009, an RTI application was filed by activist Dev Ashish Bhattacharya with the Election Commission seeking details of duties, responsibilities and accountability of MPs and MLAs. The commission replied that it was "not concerned with information sought" and it had no such information. On an appeal, the commission's appellate authority ruled that the query should have been transferred to the ministry of parliamentary affairs and ministry of law and justice.

Lok Sabha secretariat said on June 3, 2009 that there was "no provision either in the Constitution or the Rules of Procedure and Conduct of Business in Lok Sabha defining duties and responsibilities of members of Parliament or through which the accountability can be fixed on non-performing MPs".

The Lok Sabha secretariat quoted Article 99 of the Constitution, to say that the members have to "make and subscribe before the President or some person appointed in that behalf by him, an oath or affirmation according to the form set out for the purpose in the Third Schedule". The person appointed by the President is the protem speaker, who takes oath from the President in Rashtrapati Bhavan. Protem speaker also signs the roll of members in the House.

The Bihar assembly also believes that "there is no provision/rule through which the duties, responsibilities and accountabilities of MLAs are fixed". And there was "no provision in the law through which accountability can be fixed" on non-performing MLAs, it said. West Bengal assembly's public information officer said they too didn't have any specific rules "through which the responsibility and accountability can be fixed".

The Haryana Vidhan Sabha secretariat said while there were no specific acts defining the duties of MLAs, the "members are bound to bear the true faith and allegiance to the Constitution of India as law established, that he will uphold the sovereignty and integrity of India as per provisions of the Constitution of India".

The Assam assembly does not have specific rules. It said, "As per parliamentary practice and convention, the members are bound to maintain the highest tradition in parliamentary life and they are responsible to observe good conduct both inside and outside the House as well."

The story isn't much different in the responses from most other state assemblies. Kerala assembly said "no specific statute has so far been enacted by the Kerala legislative assembly".

However, in Sikkim, elected representatives have rules of procedure and conduct of business provisions "specifying the duties and responsibilities of MLAs towards the august House being public representatives", the RTI reply said. Sikkim provision says, "It will be their prime duty to maintain communal harmony and peace among the people of their respective constituencies."

The President's secretariat, after remaining silent for almost six months, referred the RTI application to the ministries of law and justice and parliamentary affairs recently. On February 18, the ministry of law and justice referred the matter to parliamentary affairs, which is yet to reply to the RTI.

కొద్దిగా ఆలోచిస్తే - అన్నాహజారే పోరాటక్రమం లో అసలు ముందు ఈ గొళ్ళెం సంగతి కీలకంగా కనిపించడంలా?

7, ఏప్రిల్ 2011, గురువారం

Article 124(2) and Article 217(1) and 222(1) of the Constitution(Supreme court Judges)


On 5.4.11, special bench comprising Justices Deepak varma and B.S.Chowhan referred the case of ‘collegiums’(appointment and transfer of judges of HC/SC) to larger Bench.
Small back drop of the scenario:
-In 1993,  in the case of SC Advocate on record Association vs. UOI(2nd -Judges transfer case),1993, 9-judge the SC  over ruled SP Gupta’s case(1st Judges transfer case) and gave CJI should have primacy in the appointments to the higher judiciary. (Supremacy of judiciary over executive)
- In re Presidential reference(AIR 1999 Constitution Bench ruled that  “consultation” must be ‘full and effective and CJI’s opinion  formed in consonance with the ‘plurality of judges’ shall have primacy under Article 124(2) and Article 217(1)  and 222(1) of the Constitution.
 -In 2008, Law Commission favoured restoration of pre-1993 position.
-The Government on Monday asked the Supreme Court to reconsider its 1993 verdict that gave 'primacy' to the judiciary over the executive in appointment of judges in the apex court and high courts. During hearing of Suraj India Trust's petition seeking a review of the 1993 ruling that led to the collegiums system under which a panel of top SC judges select judges for the higher judiciary, Attorney General GE Vahanvati supported the petition.

-A bench headed by justice Deepak Verma sent the matter to Chief Justice of India SH Kapadia to consider if it could be referred to a larger bench in the process of  review its 1993 and 1999 verdicts.
All this review is reportedly  in the back-drop of land grabbing allegations with the Karnataka Ex- CJ P.D.Dinakaran and subsequent stoppage of  promotion into the Apex court.

            I am of the opinion that the ‘Collegium’s system’ has been evolved thoroughly being a 'second' case of ‘transfer of judges case’  and and also in viewe of the fact thta  it has not given total supremacy to the CJI/judiciary and aimed at democracy  with a ‘ voting against’ method in case of 'incompetency' of any judge.  Governments may come and  go as per the democracy but the 'judicial independence' ,of course with riders, must prevail over the executive to protect the unscrupulous governments and its policies as against the spirit of preamble of the Constitution of India.

4, ఏప్రిల్ 2011, సోమవారం

'ఖరము' కాదా 'శ్రీకరము' ?

ఉగాది అంటే
ఎందుకో నాకు
వ్యక్తిత్వ వికాస గ్రంధంలో
తొట్టతొలి అధ్యాయంలా
హృద్యంగా అనిపిస్తుంది!
ఎందుకంటే అది-
ఎండిన గుండెల మోళ్ళు
మళ్ళీ తడి చిగుళ్ళు
పెడతాయని చెప్తుంది!!
బ్రద్దలైన అనుబంధాల బీళ్ళు
సారవంతమైన లోగిళ్ళవుతాయని
తెలుపుతుంది!!!
కొన్నాళ్ళపాటు తాళాలు వేస్కున్న
ఎల కోయిల గళాలు-
మళ్ళీ యుగళ గీతాలై గుబాళిస్తాయని
చాటుతుంది!
శిశిరంతో సమరం
వసంతంతో సరసం
కోసమేనని తేట పరుస్తుంది!!
షడ్రుచులతో జీవనం
షడ్రసోపేత భోజనమే అంటుంది!!!
కోకిల ఉత్తేజ గీతాలు విన్న పశుర్వేత్తి'
'ఖరము'  సైతము
కాదా  'శ్రీకరము'  అంటుంది!

27, మార్చి 2011, ఆదివారం

నేడు పాటల తోట-పుస్తకావిష్కరణ

శ్రీ వయ్యా సామేల్ గారి 'పాటల తోట ' పుస్తకావిష్కరణం కుత్బుల్లాపుర్ లోని నాగార్జున హై స్కూల్ లో ఉ.11-00 గం.కు జరగనుంది. శ్రీ సామేల్ గత పది సం.గా సిటీ అరసం సభ్యుడు గా ఉన్నారు. ఇప్పటికే పదిహేను కవితా సంపుటులను వెలికి తెచ్చారు. పేద ప్రజల పక్షపాతిగా సామజిక కార్యకర్తగా ఆయన తన పుస్తక రచన చేయటం అంతా తెలిసిందే. పెద్దగా చదువుకోలేదు గానీ సమాజాన్ని బాగా చదివారు. ఎటూ ప్రీ లాంసింగ్ గాబట్టి దేనికీ వెరవాల్సిన పనిలేక సమాజంలోని కుళ్ళుని తన కలంతో బలంగా కుళ్ళబొడిచారనేది కొన్ని పుస్తకాలు చదివిన నాకు కూడా అర్ధమయింది. దాదాపు ఆయన అన్ని పుస్తకాలకీ ముఖపత్రం వేసిన వర్చూ దీనికి కూడా  పై విధంగా ముఖపత్రం సామేల్ కి గీసిచ్చారు. ఇంటిల్లిపాదీ జ్వరాలు కాబట్టి పిలుపు వచ్చినా హాజరవలేక పోతున్నాం. ఆల్ ది బెస్ట్ సామేల్జీ!!!

24, మార్చి 2011, గురువారం

ఇదో పెట్టీ ధంధా.....

కారేసుకుని అలా ఓ పుచ్చకాయల ముందు ఆగారనుకోండి.వాడి దగ్గర చాలా చచ్చు పుచ్చువి కొన్ని కుప్ప పెట్టుకుంటాడు. అవి ఓ రెండు మూడు మీ టైర్ల కింద పడేసి నువ్వే పగలకొట్టావ్.పైసలివ్వు అని యాగీ చేస్తాడు.ఇది ఆమధ్య విన్నాను. ఇవ్వాళ నాకే ఓ రైతు బజార్ ముందు గేటు కు అడ్డంగా పెట్టుకుని ద్రాక్షపళ్ళు కొందామని అలా ఆగేనో లేదొ  .... ఏమ్మోవ్ .. కారు దిగి చూడు ఎన్ని కాయలు పగలగొట్టావో.....అంటూ చొక్కా మడిచాడు ఇలా....
...వాళ్ళవాళ్ళే చుట్టూతా పోగవుతారు...ఇలా దారిలో ఎందుకు పెట్టారు ....ట్రాపిక్ పోలీస్ పెర్మిషన్ ఉందా లాంటి మన పుచ్చు ప్రశ్నలు అక్కడ వినేవారు ఎవ్వరూ ఉండరు.  చచ్చినట్టు ఓ రెండొందలు వదిలించుకుని ఆనక  సెల్ లో క్లిక్ చేస్తోంటే రోడ్డు మీద పెట్టిన కాయలని చకచకా ముందుకు తోస్తున్నాడు...ఇలా...
ప్చ్......!!!

20, మార్చి 2011, ఆదివారం

చందమామ పై కవులు ప్రేమ-సునామీ తో రెచ్చిపోవచ్చు

చందమామ ఎప్పటికీ మామే.
బుల్లి తెరలో-  అశాస్త్రీయ పిల్లులో  భయపెట్టిన 'సూపరు' కాదు గాక కాదు.
కవి కోటికి అతగాడు ఎప్పుడూ 'సూపరే'!
ప్రాణికోటికి చల్లటి కాంతి చుక్కాని చూపరే!!
కురిపిస్తే 'చల్లని' తెల్లని 'లావా' నే-
 నాయకుడనీ అనామికుడనీ తేడా లేక
మన మీద విరుచుకు పడే సుఖమయ  స్నిగ్ధ  'సునామీయే'!
చిరు అలల కామనలు రేపుతాడే గానీ
ధరణీకంపాల దరికి  ఛస్తే  రాడు రాడు
చచ్చు   జోస్యాలని అపహాస్యం చేస్తాడే గాని
దారుణ మారణ హోమం చేతగానే కాదు
పిచ్చి 'మచ్చ' లేని మామగానే జగమేలుతాడు.

(నిన్న (  19-3-2011 )  అందరూ ఊదరగొట్టినట్టు "సూపర్ మూన్" అపకారం చేయలేదు. మరింత అందం గా కనిపించాడు.గత వంద ఏళ్ళ సమాచారాన్ని పరిశీలించినా "సూపర్ మూన్" కీ "ప్రకృతి విపత్తు" కూ సంబంధం  లేదని డిల్లీ  నెహౄ ప్లానటోరియం డైరెక్టర్ ఎన్.రత్నశ్రీ చెప్పారు. భూకంపాలు సునామీ లు భూ అంతర్గత విషయాలని చంద్రుడిని లాగడం పద్దతి కాదని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రొఫిసిక్స్ మాజీ ప్రొ.ఆర్.సీ.కపూర్ కూడా చెప్పారు. ఎటొచ్చీ అసలు విషయం "మన చందమామ" ప్రూవ్ చేశాడు. ఆవిధంగా "జ్యోతిష వేత్త" రిచర్డ్ నోలె ఓడిపోయాడు.)




18, మార్చి 2011, శుక్రవారం

.. ... పాప అయితే 'స్విని', బాబయితే 'స్వి' ... ...

    పిల్లలు పుట్టగానే తలిదండ్రులు- ఏ పేరు పెట్టాలనే 'సంబరం' తో కూడిన 'మీనమేషాల్లో'  పడ్తారు.  'నక్షత్ర' యాత్రలు చేస్తారు. 'కుజ' దోషాలన్నా 'భుజ' దోషాలన్నా ఏమైనా ఉన్నాయేమో అని చూస్తారు.మంచి 'పంచాంగానికి' ఓ సలాం పెడ్తారు. ఏ యండకా పేరు చెప్పే యండమూరి వారి పొత్తమో, మల్లా మల్లా చూసి దాచుకునే మల్లాది వారి బుక్కో పట్టుకుని మల్లగుల్లాలు పడ్తుంటారు. అన్నట్టు-వర్చూ కూడా ఓ సారి చేయి చేస్కుని 'నేమ్ యువర్ బేబి '-చిన్నారుల పేర్ల పుస్తకం ' ఓ బుక్కు రాసి 'పారేశాట్ట'. (ప్రింట్ చేసి 'పారేసిన'వారు : కవర్ డిజైనర్ ( శ్రీ  రామకృష్ణ కోట్ల) స్వయంగా పూనుకుని వారి తాలూకు ముద్రికా కమ్యూనికేషన్స్, 8-2-293/D/16, Jawahar Colony, Indira Nagar, Jubiliee Hills X Roads, Hyderabad-500 044 వద్ద పబ్లిష్ అయిన జులై, 95 ప్రతి) (కొన్నోడు, ప్రింట్ చేసినోడు, చదివినోడు ఒక్కడూ  లేడు గాబట్టి డీటైల్స్ నేను కూడా ఇచ్చి'పారేశాను'.)  
    సారీ......అసలు విషయమేంటంటే,  పైన చెప్పిన 'మీమాంస ' లో పేరెంట్స్ నవ్యాతి నవ్య  నామాల్ని శోధించి, ఒడిసి పట్టి ఒకింత 'మోడరన్ నేమ్స్'  పెట్టడం పరిపాటయింది. ఇంతవరకూ శభాష్!! తప్పే లేదు. అయితే తపస్వి, యశస్వి, ఉషస్వి, తేజస్వి లాంటి (చివర 'స్వి' వచ్చే ) పేర్ల దగ్గర చిరు జాగ్రత్త తీసుకోమని మనవి. ఉదాహరణకు, అబ్బయి కి 'యశస్వి' అన్నపేరు పెడితే,  అమ్మాయి కి 'యశస్విని' అని పెట్టాలి. అంటే చివర 'స్విని'  చేరుతుంది. 'తపస్సు ను ఆచరించే వాడు తపస్వి'  అయితే, ఆచరించే వనిత 'తపస్విని' అవుతుంది.     సో, అమ్మాయిల పేర్లు....తపస్విని, యశస్విని,ఉషస్విని,తేజస్విని, వర్చస్విని .....ఇలా అవుతాయి. అంతేకాని బావున్నాయి కదా అని ఎడాపెడా  'అమ్మాయిలకి'  తేజస్వి అనీ యశస్వి అనీ పెట్టకండేం..! ప్లీజ్....!  (బ్లాగ్స్ రీచ్ కొంత వరకు వర్కవుట్ అవుతుందని-రీచ్ అయినవారు మరికొందరి కి రీచ్ చేస్తారని ఆశిస్తూ...)
(కాదు..పెట్టచ్చు అనే భాషాశాస్త్రవేత్తలు దయచేసి ఇక్కడ మెయిల్ చెయ్యండేం)

16, మార్చి 2011, బుధవారం

సరదాగా బోటింగు సేసేసి ఆనక దూకి సస్తాననో కూస్తే ఐ.పీ.సీ. 309 లు ఆకర్షించబడవా?

ఆక్టివ్ యుథనేసియా (మెర్సీ కిల్లింగ్ అనబడే బలవన్మరణం) 'తప్పు' గానీ, పాసివ్ యుథనేసియా (చంపీ చంపనట్లున్న లేదా చచ్చీ చావనట్టున్న విధంగా ఆత్మహత్య) 'పర్లేదు' అని తేల్చి పారేసింది  సుప్రీం కోర్ట్ ''అరుణా శాన్బాగ్ కేస్'' లో్! ఇది కొందరికి  'శుభం' మరికొందరికి  'భశుం'. తీర్పులు చంపీ చంపనట్టు ఇవ్వటం మహారాజశ్రీ కోర్టు వారికి షరా మామూలే! కానీ ఈ కేసు లో సుప్రీం చాలా సమర్ధవంతమైన తీర్పే ఇచ్చింది. ఏ కోమా దశలో వారికి ఇది 'వరమే'. ఎంచేతంటే కాటికి పర్మిషన్ బంధువులు (?) అడుగుతారు. (వ్యక్తి అడగలేడు గాబట్టి) . కోర్టు 'పరిశీలిస్తుంది' ఫేవరబుల్ గా. లైఫ్ బోర్ దొబ్బో , బతకలేని (ఆర్ధిక) స్తోమత తోనో వ్యక్తే  'ఇంకోటో మరొహటో' కారణం చేత అడుగుతే నో అంటుంది చట్టం. ఎందుకు? ఐ.పీ.సీ. 306(ఆత్మహత్య కు ప్రేరేపణ) మరియు 309(ఆత్మహత్య చర్య)   ప్రకారం 'చస్తాను బాబోయ్' అంటె నేరం. ఆణ్ణి శుభ్రంగా బొక్కలో ఏసేయొచ్చు. పైన చెప్పిన తీర్పు తో 'మరింత', 'వ్యక్తిగత', 'జటిల' 'మరణ కారణాలుంటే' తప్ప చావుకు 'క్లీన్ చిట్' ఇవ్వదు చట్టం. మనలో మాట-ఉద్యమాల పేర్లు చెప్పి కొందరు నాయకమ్మన్యులు ఫొటొ కోసం కిరసిన్ సీసా గుమ్మరించుకుంటున్నట్టో ట్యాంకు బండ లో కాసేపు సరదాగా బోటింగు  సేసేసి ఆనక దూకి సస్తాననో కూస్తే ఐ.పీ.సీ. 309 లు ఆకర్షించబడవా?

15, మార్చి 2011, మంగళవారం

మన 'జీవితానికి' కోటి దండాలు

 ఇక్కడ నొక్కి  చూసి....ఓ క్షణం వీక్షణం తో రిలాక్స్ అవచ్చేమో?(నిర్మాత సౌజన్యంతో..)

ఏమి రైట్రో.....యాడి రైట్రో....!!!

పొరపాట్న
ఓ ఓటరు గుడిశ తలుపు
తట్టిన ఓ రాజకీయమ్మన్యుణ్ణి_
తలుపు తీసి ఏమడుగుతాడు?
కూడా?గూడా?గుడ్డా?
ఆ వచ్చిన వాడెవడో ముందు తెలియాలిగా!
"నువ్వు ఏ పార్టీ ?
ఏ స్టేట్ ?
అసెంబ్లా?
పార్లమెంటా ?
కార్పొరేటరా?జడ్పీయా?
గల్లీయా?
ఆంధ్రానా?
తెలంగాణా?
నార్త్ ఆంధ్రానా_సౌథ్ ఆంధ్రానా?
ఈస్ట్ తెలంగాణా_వెస్ట్ తెలంగాణా?
ఆంధ్రాలో అప్పోజీషనా_తెలంగాణా అప్పోజీషనా?
ఆంధ్రా రెబలా_తెలంగాణా రెబలా?
సెట్లర్ బాబువా?
తెలంగాణా సపోర్టింగ్ సెట్లరా_ఆంధ్రా సపోర్టింగ్ సెట్లరా?
లైఫ్ లో సెటిల్ అయిన సెట్లరా?
లైఫ్ లేని సెటిల్ కాని సెట్లరా?
సమైక్యమా అసమైక్యమా?
రీజనల్ కొత్త పార్టీయా?
నాన్ రీజనల్ పాత పార్టీయా?
అండర్ మెర్జరా?
వుడ్ బీ మెర్జరా?
పోయినోడి తాలూకు బతికున్న జండానా?
పోయినోడితోనే పోయిన జండానా?
పోకముందు సీక్రెట్ అజండానా?
పోయింతర్వాత ఓపెన్ జండానా?
ఓపెన్ 'సీక్రెటా?'
సీక్రెట్ 'ఓపెనా?'
ఏ పార్టీ జాకు?
ఏ జాకు చాకు?
........      .....    ......
.....        ......    .....
(అన్నట్టు ముగింపు: నిన్న బండు మీద సరికొత్తగా "రైటర్లు"
ప్రతిఘటించారుట. పైన చెప్పిన సాధారణ ఓటరు....సారీ! 'సాధారణ' చదువరి దగ్గరి కి ఓ
'రైటరు' వెళితే సదరు చదువరి పై ప్రశ్నాస్త్రం సంధించక తప్పదు.కంటెంట్ సంగతి తర్వాత.)

12, మార్చి 2011, శనివారం

Apex court's extraordinary powers u/a.142


Constitution of India:Art.142
The  Union judiciary-the Supreme court  is enshrined under art.from 124 to 147 under chapter 22.
In ESP Rajaram vs. UOI,2001, the SC held that art.142 has power to pass such decree or  make such order as is necessary  for doing  complete justice in any case or mater pending before it.
          Inherent power under art.142 can not be invoked when alternative remedy is available and has already been availed of. This power is only to ‘correct’ orders when other remedy is not  available. In UOI vs. Darshan Devi, 1997 it’s held that since remedy by way of ‘review’ is under the rules of SC, the inherent power cannot be invoked.
          On 10.3.11, SC exercising above article, has reduced one year sentence  of an 81 (K. Ramabhadran Nair) year old man in a corruption case  ‘to the period already undergone’ because of the ‘vegetative state’ he is in.
          In a review petition filed by the wife of Nair on the ground that a person of unsound mind and can not be kept under prison u.s.30 of Prisoners Act 1900,(here the individual is suffering from Alzheimer disease and not a sound person), is allowed and ruled  in Nairs favor under this extraordinary jurisdiction.

10, మార్చి 2011, గురువారం

'మార్చి ' నెల-బాలలు

ఏమిటేమిటి.....?
మార్చా.....?
లాంగ్ మార్చా....? లుంగీ  మార్చా....?
కాదు...ఖద్దరు 'కండూతి' మార్చా...?
ఓహొ...స్కూలు పరీక్షల 'మార్చా '?
మరి ఇది ...
పిలకాయల తలకాయలకి పరీక్షా?
కేంద్ర రాష్ట్రాల ప్రిస్టేజ్ పరీక్షా?
పాలక పక్షుల బ్యాటింగుల
ప్రతి పక్షుల బౌలింగుల మధ్య
పాపం....!
విధ్యార్ధులకు పరీక్షే పరీక్ష!!
పిల్లల ఉసురు పోసుకుంటున్న
ఖద్దర్ల కి
రేపో మాపో పడకపోతుందా
శిక్ష పై శిక్ష!!!

7, మార్చి 2011, సోమవారం

అల్లు వారి పెళ్ళి లోగిలి


అల్లు అరవింద్ గారి వద్ద నుంచి - బన్నీ పెళ్ళి శుభలేఖ వస్తే సరే కదా అని వెళ్ళాం. సాయంత్రం ఎనిమిది కి వెళ్తే పదకొండు కు బైట పడ్డాం. అయితే 'సినీమా పెళ్ళి ' కి వెళ్తే మనలాంటి లస్కుటపా గాళ్ళని 'త్రోసి ' రాజని 'వీ.వీ.వీ.ఐ.పీ.లకి  తప్పా సుఖమయమైన ఎన్ట్రీ ఉండదని మరో  मार् తెలిసొచ్చింది. హై 'టెక్కు ' సిటీ అంతా జజ్జనకరి జనారే జనసంద్రమైంది ఇలా.
ఎవడు వీపీ నో ఎవడు వీఐపీ నో మనకనవసరం గదా?ఎల్లామా-చూశామా. ఈయన అప్పటి కప్పుడు (అంటే నిన్న మద్యాహ్నం) ఓ కేరికేచర్ ప్రెసంట్ చేద్దామని గీసి ఆనక దాన్ని ఓ 'అయ్య ' చేతిలో పెట్టడానికి  విఫలయత్నం చేశారు. అది ఇలా ఉంది.

నేనే అది కాస్తా పగిలి ఊర్కుంటుందని ఓ రెండు మూడు రోజుల తర్వాత డైరెక్ట్ గా ఇంటికెళ్ళి బన్నీ కి ఇస్తామంటే 'అలాక్కానియ్' అన్నారు. ఈ సెక్యూరిటీ ఏ౦దో ఓ స్టేజ్ లో పబ్లిక్ ని పాసు గీసు లేపోయినా ఒదిలి పారేసారు ....పాసు గూల- అని కొంతమంది మొత్తుకుంటే చూశాను. దీని ప్రతాపం సహజంగానే భో'జన ' శాల మీద ఇలా పడింది.
ఈయనైతే ఇలా కుమ్మించుకుంటూ 'కుమ్మటం' మనవల్ల గాదు. పద బయటికొచ్చి ఏ చట్నీసో కాదంటే కేఫ్ నందినీ కో చలేంగే అన్నారు. మరి నేనుండ్లా-ససేమిరా అన్నాను.