13, మే 2008, మంగళవారం

కేంద్ర ప్రభుత్వ  ఉద్యోగులు లేదా మరో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అనే జీవులు అంటే 'మహా చిరాకు' పడే లేదా ప్రదర్శించే ప్రముఖులూ పత్రికలూ మనచుట్టూ మస్తు ఉన్నై. ఈ నేపద్యం లో రెండు విషయాలు నన్ను ఆకర్షించాయి.
ఒకటి, ౯.౫.౦౮ (నైంత్   మే)స్వాతి పత్రిక లో  ఒక పేజీ. ఎస్. కొండల రావు  అనే కర్మయోగి  1970  లో'క్లార్క్ కం typist' గా రాష్ట్ర ప్రభుత్వ సర్వీసెస్ లో చేరి 1996 లో నే అసిస్టెంట్ కమీషనర్ గా ప్రొమోట్ అయ్యారుట. ఈన ఒక doctor  కూడాను ata. (చదవలేదు సుమ... ఏదో university వారు ' చదివించారు' ata. ) ప్రస్తుతం endowments డిపార్టుమెంటు, కాకినాడ లో రిజినల్  జాయింట్ కమీషనర్ ఆట. క్లార్కులు క్లార్కులు గా మగ్గి చావాల్సిన   ఈ కర్మ భూమి లో ఈ మహానుభావుడు ఇంత జంప్ చేసాడంటే ....ఆయనకు జోహార్లు. ఇది మన రాజ్యాంగం  'చదివించిన' 'కోటా ' మహిమా లేక 'స్వయం కృషా'  లేక 'ఇంకేదయినా' నా? అందరు 'క్లార్కులు' ఇలా అయితె ఎంతబాగుండు?
రెండో అంశం.  నేటి ఈనాడు పదిహేనవ పేజి లో ఓ  చిన్న వార్త. ఏంటంటే, దేవ దత్త్ అనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి (గౌహతి)  ACRS.(వార్షిక రహస్య వేదిక) సరిగా లేకపోవడం , ఆ విషయం తనకి తెలియక పోవడం మూలాన ప్రమోషన్స్ రాకపోవడం జరిగిందట. సదరు వ్యక్తి కోర్టుకు వెళితే , గౌహతి కోర్టు 2001 లో.... 'రహస్య నివేదికలు వ్యక్తులకు చెప్పాల్సిన  పని లేదు' అని హై కోర్ట్ తీర్పు చెప్పితే....ఆనక సుప్రీం కోర్ట్ లో కేసు వేయడమూ, సదరు అగ్ర న్యాయ స్థానము 'నో...నో...ఉద్యోగికి సమాచారాన్ని అంతటినీ అందించాల్సిందే...పద్నాల్గవ అధికరణ (చట్టం ముందు అంతా సమానులే) పాటించాల్సిందే...' అంటు Right to Information Act  కన్నా పవర్ఫుల్ జడ్జిమెంట్ ఇట్చిందిట. ఇది సామాన్యమయిన రిలీఫ్ కాదు  ఉద్యోగికి. అసలు ఈ రహస్య నివేదికలు
కాన్సెప్ట్ ఒకరకంగా తప్పు. ఇది ఉండబెట్టి బ్రిటిష్ వాడి గులాం గిరి భారతం లో నడుస్తుంది గాని... లేకపొతే ప్రభుత్వ ఉద్యోగుల క్రియేటివిటీ  వాళ్ళ వర్క్ కల్చర్  ఇబ్బడి ముబ్బడి గా పెరిగిపోదు...? ఆ దిశగా ఈ శుభపరిణామం   పరిపక్వం గా మారే రోజు దగ్గరలోనే ఉంది.

కామెంట్‌లు లేవు: